YSRTP YS Sharmila Padayatra Will Resume From August 8, Details Check - Sakshi
Sakshi News home page

YS Sharmila Padayatra: 8 నుంచి షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

Published Sat, Aug 6 2022 1:28 AM

YSRTP YS Sharmila Padayatra Will Resume From August 8 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 8 నుంచి పునఃప్రారంభం కాను న్నట్లు పాద యాత్ర కోఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ తెలి పారు. కొడంగల్‌ నియోజకవర్గం కొడంగల్‌ పట్టణంలో భారీ బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచే షర్మిల పాదయాత్రను మొదలు పెడతారన్నారు.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న షర్మిల.. ఇకపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. 

Advertisement
Advertisement