పార్టీ నిర్మాణంపై వైఎస్‌ షర్మిల దృష్టి

YS Sharmila Focus On Party Developmental Activities - Sakshi

అధికార ప్రతినిధుల నియామకం 

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్‌ షర్మిల త్వరలో ప్రకటించనున్న రాజకీయ పార్టీకి సంబంధించిన నిర్మాణ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్‌ చేశారు. షర్మిల పార్టీ అధికార ప్రతినిధులుగా కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్‌ ముజ్జాద్‌ అహ్మద్, మతిన్‌ ముజాదద్ది, భూమిరెడ్డి, బీశ్వ రవీందర్‌లు నియమితులైనట్లు వైఎస్‌ షర్మిల కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top