ప్లీజ్‌.. మా ఊరికి రావొద్దు | Warangal Village People Self Lockdown Not Allowed For Others | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. మా ఊరికి రావొద్దు

Jul 27 2020 10:52 AM | Updated on Jul 27 2020 10:52 AM

Warangal Village People Self Lockdown Not Allowed For Others - Sakshi

పులుకుర్తి గ్రామస్తులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచె

వరంగల్‌ అర్బన్‌,దామెర: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై.. లాక్‌ డౌన్‌ విధించిన తొలిరోజుల్లో పలు గ్రామాల ప్రజలు తమ ఊరికి ఎవరూ రావొద్దంటూ పొలిమేరల్లో కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పలు కారణాలతో ఆ కంచెలు తొలగించడం.. ప్రస్తుతం కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు మళ్లీ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పసరగొండ గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఆగ్రామం నుంచి ఎవరూ తమ గ్రామానికి రావొద్దంటూ పులుకుర్తి గ్రామస్తులు తమ ఊరి పొలిమేరలో కంచె ఏర్పాటు చేసి రాకపోకలను నిలువరించారు. సర్పంచ్‌ అశోక్, ఉపసర్పంచ్‌ రాజు మాట్లాడుతూ సమీప గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  గ్రామస్తుల కోరికమేరకు పొలిమేరలో కంచె ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement