కంగారులో ఇంజిన్‌ ఆఫ్‌ చేయలేదు.. బీభత్సం సృష్టించిన ట్రాక్టర్‌

Video: Tractor Parked in Narsapur Moved on the Road Without A Driver - Sakshi

సాక్షి, మెద‌క్ : జిల్లాలోని నర్సాపూర్‌ పట్టణంలో డ్రైవర్‌ లేకుండానే ఓ ట్రాక్టర్‌ బీభత్సం సృష్టించింది. పార్కింగ్‌లోని ద్విచక్ర వాహనాలపైకి ట్రాక్టర్‌ దుసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పార్క్‌ చేసి ఉన్న 12 బైకులు ధ్వంసమయ్యాయి.  వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట్‌ గ్రామానికి చెందిన రమేష్‌ తన ట్రాక్టర్‌ను సర్వీసింగ్‌ చేయించి మెదక్‌ మార్గంలో గల ఓ వైన్స్‌ షాప్ సమీపంలో పార్క్‌ చేశాడు. కంగారులో డ్రైవర్‌ ట్రాక్టర్‌ ఇంజిన్‌ ఆఫ్‌ చేయకుండానే పక్కనున్న దుకాణంలోకి వెళ్లాడు.

ఇంతలో ట్రాక్టర్‌ ఉన్నట్టుండి ముందుకు కదలడం ప్రారంభించింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమవ్వగా మరో పది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులు స్పందించి బ్రేకులు వేసి ట్రాక్టర్‌ను ఆపారు. ఆ సమయంలో అక్కడ జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top