‘ప్రవేశ పరీక్ష రాయకున్నా పీజీ ప్రవేశాలు’ 

TSCPGET 2021 Web Counselling Seats Should Filled Colleges Under Universities - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌సీపీజీఈటీ–2021 మూడు విడతల వెబ్‌ కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్లను ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు భర్తీ చేసుకోవాలని కన్వీనియర్  ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి శనివారం పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేసి 14న ఓయూలోని పీజీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ప్రవేశ పరీక్షను రాయని అభ్యర్థులు, సీపీజీఈటీ–2021లో అర్హత సాధించని విద్యార్థులకు సైతం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించవచ్చని తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top