తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ | Transfers Of Several Ias Officers In The Telangana | Sakshi
Sakshi News home page

పశుసంవర్ధక శాఖకు అధర్‌ సిన్హా

Jan 21 2022 2:54 AM | Updated on Jan 21 2022 2:56 AM

Transfers Of Several Ias Officers In The Telangana - Sakshi

అధర్‌ సిన్హా

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ అధర్‌సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్‌ఐ కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

వెయిటింగ్‌లో ఉన్న కె.నిర్మలను ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శిగా బదిలీ చేసి ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి జయేశ్‌రంజన్‌ను తప్పించారు. కె.మనిక్కారాజ్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీచేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి రాహుల్‌ బొజ్జాను తప్పించారు. పౌసుమి బసు, శ్రుతి ఓఝాలను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా, ఎం.హరితను విద్యాశాఖ ఉప కార్యదర్శిగా, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీచేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement