పశుసంవర్ధక శాఖకు అధర్‌ సిన్హా

Transfers Of Several Ias Officers In The Telangana - Sakshi

ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణీప్రసాద్‌..

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ అధర్‌సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్‌ఐ కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

వెయిటింగ్‌లో ఉన్న కె.నిర్మలను ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శిగా బదిలీ చేసి ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి జయేశ్‌రంజన్‌ను తప్పించారు. కె.మనిక్కారాజ్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీచేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి రాహుల్‌ బొజ్జాను తప్పించారు. పౌసుమి బసు, శ్రుతి ఓఝాలను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా, ఎం.హరితను విద్యాశాఖ ఉప కార్యదర్శిగా, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీచేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top