బల్కంపేట బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి | Telangana SI Rajeshwar Died In Road Accident At Sangareddy, More Details Inside | Sakshi
Sakshi News home page

బల్కంపేట బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

Jul 3 2025 8:15 AM | Updated on Jul 3 2025 9:28 AM

Telangana SI Rajeshwar Death At Sangareddy

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ పోలీసు శాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం కారణంగా ఎస్‌ఐ రాజేశ్వర్‌ మృతి చెందారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

వివరాల ప్రకారం.. ఫిల్మ్ నగర్ ఎస్‌ఐ రాజేశ్వర్‌ నిన్న రాత్రి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో చేర్యాల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశ్వర్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా రాజేశ్వర్‌ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement