తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా కేసులు

Telangana New Coronavirus Cases Recorded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,933 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 16 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 3,527 మంది వైరస​ బారి నుంచి కోలుకుని  డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి .రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,93,103కు చేరింది. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,394కి పెరిగింది. గత 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 165 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

చదవండి: Corona Virus: తప్పని ‘మహ’ ముప్పు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top