మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలు.. కాంగ్రెస్‌ పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు | Telangana ministers appointed as Maharashtra Jharkhand Election Observers | Sakshi
Sakshi News home page

Maharashtra, Jharkhand Elections: పరిశీలకులుగా తెలంగాణ మంత్రులకు చోటు

Oct 15 2024 5:33 PM | Updated on Oct 15 2024 6:07 PM

Telangana ministers appointed as Maharashtra Jharkhand Election Observers

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.

మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు తారిక్‌ అన్వర్‌, అధిర్‌ రంజన్‌ చౌదరిని నియమించారు.

కాగా మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో, జార్ఖండ్‌కు రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 20న మహారాష్ట్రకు, నవంబర్‌ 13న, 20న జార్ఖండ్‌కు ఎన్నికలు జరగనున్నాయి.


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement