అయ్యో.. ఉరి తప్పింది కానీ చావు తప్పలేదు! | Telangana: Drunk Man Decreased Over Hang Himself On Tree | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఉరి తప్పింది కానీ చావు తప్పలేదు!

Dec 15 2022 12:11 PM | Updated on Dec 15 2022 3:39 PM

Telangana: Drunk Man Decreased Over Hang Himself On Tree - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సదాశివనగర్‌ (ఎల్లారెడ్డి): ఓ యువకుడి పాలిట ఉరి తప్పిందనుకుంటే మృత్యువు మరో రూపంలో వచ్చింది. చెట్టుపై ఉరివేసుకుని కొన ఊపిరితో ఉన్న యువకుడిని కిందికి దించుతుండగా జారి పడి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండల కేంద్రానికి చెందిన కొత్తకొండ బీరయ్య(35) మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు.

రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత ఉరివేసుకుని చచ్చిపోతానంటూ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు ఎక్కాడు. జనాలు గుమిగూడటంతో...ఎవరైనా చెట్టెక్కితే పైనుంచి దూకుతానంటూ బెదిరించాడు. భార్య, పిల్లలు, గ్రామ సర్పంచ్, బంధువులు అతడిని దిగమని అడిగినా పట్టించుకోలేదు. అంతలోనే చెట్టుకి ఉరి వేసుకున్నాడు. కొనప్రాణం ఉండటంతో గమనించిన గ్రామస్తులు చెట్టు ఎక్కి కిందికి దించుతుండగా జారి నేలపై పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలు అయి మృతి చెందాడు. మృతునికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: షికారుకెళ్లి నరకయాతన.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న యువకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement