‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్‌ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

Telangana: 10th Class Exam Paper Reduced From 11 To 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షల పేపర్లను కుదించింది. దీంతో ఈ ఏడాది టెన్త్‌లో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నట్లు, ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌ర్‌గానే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2020-21లో 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. 2021-22లో కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించడం గమనార్హం.
చదవండి: భారత్‌: మన ఇంటర్నెట్‌ వేగం అంతంతే!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top