ఫోన్ ట్యాపింగ్‌.. సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు హాజరు | SIB Prabhakar Rao Attend SIT Office At Hyderabad | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగ్‌.. సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు హాజరు

Jun 9 2025 11:38 AM | Updated on Jun 9 2025 1:51 PM

SIB Prabhakar Rao Attend SIT Office At Hyderabad

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు.

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ రావును సిట్‌ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను సిట్‌ అధికారులు విచారించారు. నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్‌ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్, ఫోరెన్సిక్ నుండి డేటాను సిట్‌ అధికారులు తెప్పించుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement