సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు, ఉత్తర తెలంగాణకు వర్ష సూచన జారీ అయ్యింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, వరంగల్, నిజామాబాద్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


