
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో ప్రభాకర్ రావు తమకు సహాకరించడంలేదని సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును పోలీసు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు.
ఎస్ఐబీ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నేడు ఐదోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ అధికారులు.. ప్రభాకర్ రావును విచారించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తమ విచారణకు ప్రభాకర్ రావు సహాకరించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. సిట్ అడిగిన ప్రశ్నలను ప్రభాకర్ రావు దాటవేస్తున్నట్టు చెబుతున్నారు. సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
ప్రభాకర్ రావును పోలీసు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. అలాగే, ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్ను కూడా రద్దు చేయాలని కోరే అవకాశం ఉంది. ఇక, గతంలో ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుత డీజీపీ జితేందర్, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పీఎస్లో సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ హాజరయ్యారు.