చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు..

One Person missed  in Stream During Fish Hunting In Jangaon - Sakshi

జనగామ:  జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ వద్ద ఆకేరు వాగులో చేపల వేట కోసం మంగళవారం ఉదయం 9 గంటలకు నలుగురు యువకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు చెక్ డ్యామ్ వద్ద చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు 23 సంవత్సరాల ఆరూరి వంశీ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో ఆరూరి వంశీని కాపాడడానికి అతని వెంట ఉన్న ఆరూరి శ్రవణ్, పాశం సందీప్, శాగంటి ప్రమోద్ ప్రయత్నించారు.

కానీ ఆరూరి వంశీ ఆచూకీ దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్, డీసీపీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  మరోవైపు ఆరూరి వంశీ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టిన ఇంకా వంశీ ఆచూకీ దొరకలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top