Experts Says New Omicron Variants Not Causing Significant Rise In India - Sakshi
Sakshi News home page

కొత్త వేరియంట్‌ ప్రభావం భారత్‌పై తక్కువే

Dec 26 2022 4:02 AM | Updated on Dec 26 2022 3:30 PM

New Omicron variants not causing significant rise in india - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్‌ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు.

గతంలో ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్‌–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్‌ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్‌ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్‌ వచ్చినప్పుడు బూస్టర్‌ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement