దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం: కోమటిరెడ్డి
భువనగిరి: యాదాద్రి పుణ్యక్షేత్ర పునః ప్రారంభానికి తనను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం పంపలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు. దేవుడి దగ్గర కేసీఆర్ రాజకీయాలు చేయడం బాధాకరం అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
యాదాద్రి పునఃప్రారంభానికి @TelanganaCMO ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు.
కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించింది.
దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2022