సాక్షి,హైదరాబాద్: మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. వరంగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘15నిమిషాలు సమయం ఇస్తే హిందువులకు తన సత్తా ఏంటో చూపిస్తానని ఓవైసీ చెప్తున్నాడు. నీకు 15 నిమిషాలు కావాలేమో.. మా కార్యకర్తలకు ఐదు నిమిషాలు చాలు అని వ్యాఖ్యానించారు. ప్లేస్ నువ్వే చెప్పు.. నీ అడ్డాకు రమ్మంటే వస్తా’ అని సవాల్ విసిరారు.


