సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్ అలకబూనారు. ప్రొటోకాల్ ఇవ్వకపోవడంతో అలక చెందిన దానం నాగేందర్.. తాను వచ్చే లోపే గృహలక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై మండిపడ్డారు. బంజారాహిల్స్ కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో ఈ ఘటన జరిగింది.
ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారంటూ దానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న దానం నాగేందర్.. కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద విషాదం


