ఓఎంసీ కేసు నుంచి తప్పించండి | Minister Sabitha Indra Reddy Filled Petition In High Court On Mining Case | Sakshi
Sakshi News home page

ఓఎంసీ కేసు నుంచి తప్పించండి

Jan 25 2023 1:09 AM | Updated on Jan 25 2023 3:14 PM

Minister Sabitha Indra Reddy Filled Petition In High Court On Mining Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓబుళాపురం గనుల కేసు నుంచి తన పేరును తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో ఆమె సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు.

వాదనలు విన్న న్యాయస్థానం మంత్రి అభ్యర్థనను గత అక్టోబర్‌లో తోసిపుచ్చింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కేసుతో తనకు సంబంధం లేనందున పేరు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది 

Advertisement
 
Advertisement
Advertisement