హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, ఫిల్మ్నగర్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్పురా, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, మియాపూర్లో వాన కురిసింది. హైదరాబాద్లో అర్ధరాత్రి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు, నల్లగొండ జిల్లాలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. తిరుమలగిరి (సాగర్) మండలం బోయగూడెం గ్రామంలో పిడుగుపాటుకు పశువుల కాపరి పుట్టపాక మల్లయ్య(45) మృతి చెందాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.


