మళ్లీ ఆగిన మెట్రో రైలు!

Metro Rail Stopped For 15 Min Due To Technical Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-5 వద్ద మెట్రో 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను మరో రైల్లో రాయదుర్గం తరలించారు. ఈ మార్గంలో అరగంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఇటీవల అసెంబ్లీ మెట్రో స్టేషన్‌ వద్ద సాంకేతిక సమస్యలతో మెట్రో రైల్‌ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్‌ లోపాలు, సాంకేతిక సమస్యలు తరచూ మెట్రోరైల్‌కు బ్రేకులు వేస్తున్నాయి.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top