మేడారం జాతర.. ఉప్పల్ బస్టాండ్‌లో పిల్లల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్‌లు | Measures For Security Of Medaram Devotees Children In Uppal Bus Stand | Sakshi
Sakshi News home page

మేడారం జాతర.. ఉప్పల్ బస్టాండ్‌లో పిల్లల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్‌లు

Jan 29 2026 2:56 PM | Updated on Jan 29 2026 3:07 PM

Measures For Security Of Medaram Devotees Children In Uppal Bus Stand

వీఐ సురక్షిత కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాప్ వద్ద వీఐ సురక్షిత కేంద్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు గుర్తింపు ట్యాగ్‌లు (wristbands) వేస్తున్న విధానాన్ని పరిశీలించి.. స్వయంగా పిల్లలకు ట్యాగ్‌లు వేశారు. మేడారం వెళ్లే సమయంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సురక్షిత చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. జాతర కోసం ఆర్టీసీ తీసుకున్న చర్యలు పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సురేష్ కుమార్, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ కె. భాస్కర్, పరిపాలనా సబ్ ఇన్‌స్పెక్టర్ మాధవరెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు చిరంజీవి, వినయ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement