వాటర్‌ ట్యాంకుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య | Man Jumps Off Water Tank Dies By Suicide | Sakshi
Sakshi News home page

వాటర్‌ ట్యాంకుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Aug 22 2024 10:02 AM | Updated on Aug 22 2024 10:03 AM

 Man Jumps Off Water Tank Dies By Suicide

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన దృశ్యాలు

జీడిమెట్ల: మద్యం మత్తులో ఓ వ్యక్తి వాటర్‌ ట్యాంక్‌ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పార్వతీపురంనకు చెందిన బావిరి రాము (53)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లో ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు.

 15 రోజుల క్రితం కూడా రాము మద్యం మత్తులో భార్యతో గొడవపడి  ఇంటి నుంచి  వెళ్లిపోయి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో స్థానిక ఎల్లమ్మ పోచమ్మ గుడి వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి  కిందికి దూకి మృతి చెందాడు. మృతుడి కుమారుడు జైకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రాము వాటర్‌ ట్యాంక్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.     

పోలీసులకు సమాచారం అందినా స్పందించలేదా? 
రాము ట్యాంక్‌పైకి ఎక్కడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదనే వదంతులు ఉన్నాయి. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. రాము ట్యాంక్‌పైకి ఎక్కి నిమిషాల్లోనే దూకి మృతి చెందాడని, ఈ విషయమై తమకు, డయల్‌ 100కు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని తెలిపారు.   
 

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement