‘హత్యాచార’ నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తాం
మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మేడ్చల్: నగరంలోని సింగరేణికాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం ఆపై హత్య చేసిన నిందితుడిని వదిలిపెట్టబోమని, అతడిని తప్పకుండా ఎన్కౌంటర్ చేస్తామని మంగళవారం మంత్రి మల్లారెడ్డి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణికాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లే పరిస్థితి లేనందున తాము అక్కడకు వెళ్లలేదని, త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారాన్ని అందజేస్తామని మంత్రి తెలిపారు.