Heavy Rains In Telangana: Due To Low Pressure, Heavy Rains in Telangana For Next 2 Days | తీవ్ర అల్పపీడనం - Sakshi
Sakshi News home page

తీవ్ర అల్పపీడనం

Oct 22 2020 2:51 AM | Updated on Oct 22 2020 11:19 AM

Heavy Rains In Telangana For Two Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో ఒడిశా తీరానికి దగ్గరలో ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధం గా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతెలంగాణపై కూడా ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజుల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రం గారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం సగటున రాష్ట్రంలో 8.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌ నుంచి బుధవారం నాటికి నమోదైన వర్షపాతం గణాంకాల ను పరిశీలిస్తే రాష్ట్రంలో సగటున కురవాల్సిన 80.2 సెం.మీ. సాధారణ వర్షపాతానికి గాను ఈ నెల 21 నాటికే 124.63 సెం.మీ. సగటు వర్షం కురిసింది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement