HYD: రూ. కోటి 26 లక్షలు పలికిన గణేశ్‌ లడ్డూ | Hyderabad: Ganesh Laddu Auctioned For Rs 1 Crore 26 Lakhs In Bandlaguda Jagir Keerthi Richmond Villa - Sakshi
Sakshi News home page

Ganesh Laddu Auction 2023: రూ. కోటి 26 లక్షలు పలికిన గణేశ్‌ లడ్డూ

Sep 28 2023 9:43 AM | Updated on Sep 28 2023 3:09 PM

Ganesh Laddu Auctioned For Rs 1 Crore 20 Lakh In Keerthi Richmond Villa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది. వినాయకుడి లడ్డూ వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది.

మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలో కూడా గణపతి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. మైహోమ్‌ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25.50 లక్షలు పలికింది. చిరంజీవి గౌడ్‌ అనే వ్యక్తి  వేలంలో గణపతి ప్రసాదాన్ని దక్కించుకున్నారు

భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement