-
ప్రపంచంలోనే తొలి పోస్టల్ స్టాంప్ వేలానికి
సాక్షి, నేషనల్ డెస్క్... ప్రపంచంలోనే మొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంప్ వేలానికి వచ్చింది. ఒక పెన్నీ ముఖ విలువతో కూడిన దీనికి దాదాపు రూ.20 కోట్ల (25 లక్షల డాలర్ల) దాకా పలకవచ్చని భావిస్తున్నారు. 1850 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్లరంగు స్టాంప్ను పెన్నీ బ్లాక్ స్టాంప్గా పిలుస్తారు. ఇంగ్లండ్లో బెడ్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బ్లెంకిన్స్లోప్ అనే వ్యక్తికి అక్కడికి 300 మైళ్ల దూరంలోని లండన్ నుంచి పంపిన లెటర్పై దీన్ని అంటించారు. ఇలా స్టాంపులంటించడం ద్వారా పోస్టేజీ చార్జీలను ముందుగానే చెల్లించే పద్ధతి అప్పటిదాకా ఉండేది కాదు. లెటర్లను అందుకునే వాళ్లే పోస్ట్మాన్కు పోస్టేజ్ రుసుము చెల్లించేవాళ్లు. వాళ్లు గనక లెటర్లను తీసుకునేందుకు నిరాకరిస్తే పోస్టల్ శాఖకు నష్టమే మిగిలేది. దీనికి చెక్ పెట్టేందుకు సర్ రోలాండ్ హిల్ ఈ పెన్నీ బ్లాక్ పోస్టల్ స్టాంప్ను రూపొందించాడు. ప్రఖ్యాత వేలం సంస్థ సోత్బీ ఫిబ్రవరిలో దీన్ని వేలం వేయనుంది. ప్రపంచ సమాచార వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ పోస్టల్ స్టాంప్ వేలానికి రావడం ఎంతో ఎక్సైటింగ్గా ఉందని సోత్బీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ ఆస్టిన్ అన్నారు. చదవండి: లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు -
దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..?
ముంబయి: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) జనవరి 5న వేలం వేయనుంది. మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వికుల ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూమితో సహా నాలుగు ఆస్తులు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాపర్టీల ధర రూ. 19.2 లక్షలు. ఇందులో చిన్న ప్లాట్ను రూ. 15,440 రిజర్వ్ ధరగా ఉంచారు. అంతకుముందు 2017, 2020లో దావూద్ ఇబ్రహీంకు చెందిన 17 ఆస్తులను SAFEMA వేలం వేసింది. "దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీకి చెందిన నాలుగు ఆస్తులను జనవరి 5న వేలం వేస్తున్నాం. ఈ ఆస్తులు మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో వ్యవసాయ భూమి రూపంలో ఉన్నాయి. జనవరి 5న మధ్యాహ్నం 2:00 నుంచి 3:30 గంటల మధ్య వేలం ప్రక్రియ జరగనుంది" అని SAFEMA ఓ ప్రకటనలో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం, ఆయన కుటుంబ సభ్యులపై స్మగ్లింగ్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కేసుల్లో ఈ ఆస్తులు అటాచ్ చేశారు. 2017లో వేలం వేసిన దావూద్ ఆస్తులు రూ.11 కోట్లు పలికాయి. 2020లో, వేలంలో దావూద్ ఆస్తులు రూ. 22.79 లక్షలు పలికాయి. ఇదీ చదవండి: Lok Sabha Election: తొలిసారి లోక్సభకు జేపీ నడ్డా పోటీ? -
వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధిచిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు. ఇక గడిచిన 9 ఏళ్ల దావూద్, అతని కుటుంబానికి సంబంధిచిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్( రూ.4.53 కోట్లు), ఆరు ఫ్లాట్లు(రూ. 3.53 కోట్లు), గెస్ట్ హౌజ్(రూ. 3.52 కోట్లు) అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్.. 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే దావూద్ ముంబై పేలుళ్ల అనంతరం భారత్ విడిచివెళ్లిన విషయం తెలిసిందే. ముంబై పెలుళ్లలో 257 మంది మృతి చెందారు. ఇటీవల దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసత్యాలని రెండు నిఘా వర్గాలు తేల్చాయి. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే! -
HYD: రూ. కోటి 26 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ రికార్డు ధరకు పలికింది. వినాయకుడి లడ్డూ వేలంలో రూ. కోటి 26 లక్షలు పలికింది. మాదాపూర్లోని మైహోమ్ భుజాలో కూడా గణపతి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25.50 లక్షలు పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వేలంలో గణపతి ప్రసాదాన్ని దక్కించుకున్నారు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. -
ఆల్ టైం రికార్డ్,వేలంలో రూ.41లక్షలు పలికిన లడ్డూ..ఎక్కడంటే?
ప్రపంచ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలకగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో లడ్డు ధర రికార్డ్ స్థాయిలో రూ.41లక్షలు పలికింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన కీర్తి రిచ్మాండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో 179విల్లాస్లో 82 మంది నివసిస్తున్నారు. అయితే స్థానికులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహించారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపిన లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర ఆల్ టైమ్ రికార్డ్ను క్రియేట్ చేసింది. లడ్డూ వేలం పాటలో 5 కేజీల లడ్డూ రూ.41లక్షలు పలికినట్లు నిర్వాహకలు తెలిపారు. ఇక్కడ 2019లో జరిగిన వినాయక చవితి లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర 27లక్షలు పలికింది. కానీ ఈ సారి ఏకంగా రూ.41 లక్షలు పలకడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏదాడి బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement