కృష్ణా ఎగువన వరద తగ్గుముఖం | Flood water released from Nagarjunasagar project | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎగువన వరద తగ్గుముఖం

Aug 15 2025 5:18 AM | Updated on Aug 15 2025 5:18 AM

Flood water released from Nagarjunasagar project

సాగర్‌ వద్ద మూడు రంగుల విద్యుత్‌ వెలుగుల్లో కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలంలో 3 గేట్లు, సాగర్‌లో 26 గేట్ల ద్వారా నీటి విడుదల 

అలుగుపోస్తున్న డిండి ప్రాజెక్టు

నాగార్జునసాగర్‌/దోమలపెంట/డిండి: ఎగువ నుంచి కృష్ణానది నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎత్తి ఉంచిన 7 గేట్లలో 4 గేట్లను గురువారం మూసివేశారు. 3 గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 881.9 అడుగుల వద్ద 198.3623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సాగర్‌ ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. 26 క్రస్ట్‌గేట్లు 5 అడుగులు ఎత్తి దిగువకు స్పిల్‌వే మీదుగా 2,03,762 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.50 అడుగులు ఉంది. 

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం సమీపంలోని డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి గురువారం అలుగుపోస్తోంది. ఎగువన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు దుందు వాగు పరవళ్లు తొక్కడంతో డిండి ప్రాజెకుకు వరద వచ్చింది. డిండి ప్రాజెక్టు అలుగు పోస్తుండగా, ఆ సుందర దృశ్యాన్ని దిగువన హైదరాబాద్‌–శ్రీశైలం హైవేపై వెళుతున్న వాహనదారులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement