సంగారెడ్డి, సాక్షి: గడ్డిపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


