industrial coridor
-
పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. పేలిన రియాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి.దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. -
పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?
సంగారెడ్డి, సాక్షి: గడ్డిపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గండ్రాజుపల్లె పారిశ్రామికవాడతో ఉపాధి
గంగవరం:మండలంలోని గండ్రాజుపల్లె పారిశ్రామికవాడతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీఐసీసీ చైర్మన్ క్రిష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన గండ్రాజుపల్లె పారిశ్రామికవాడలో నిర్మాణంలో ఉన్న పలు పరిశ్రమలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 20 పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి భూమి తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. అందులో ఐదు పరిశ్రమల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. నాలుగురోడ్ల కూడలిలో నిర్మించిన హెచ్టూ అపెరల్స్(గార్మెంట్స్)లో ప్రస్తుతం మూడు వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అనంతరం హెచ్టూ అప్పెరల్స్ గార్మెంట్ పరిశ్రమలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్ఎం ప్రతాప్రెడ్డి, ఏపీఐసీసీ మేనేజర్ మునిరత్నం. హెచ్టూ అప్పెరల్స్ ఎండీ హర్షవర్థన్, ఫ్రిమస్ ఫాస్టనర్ పరిశ్రమ ఎండీ జనార్థనరెడ్డి, సిబ్బంది క్రిష్ణప్ప పాల్గొన్నారు.


