కేసీఆర్‌కు 18 ప్రశ్నలు.. కమిషన్‌కు కీలక డాక్యుమెంట్స్‌ | Ex CM KCR Attends Kaleshwaram Commission Inquiry Live Updates, Top News Headlines And Viral Videos | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు 18 ప్రశ్నలు.. కమిషన్‌కు కీలక డాక్యుమెంట్స్‌

Jun 11 2025 9:02 AM | Updated on Jun 11 2025 1:42 PM

Ex CM Kcr Attends Kaleshwaram Commission inquiry Updates

కేసీఆర్‌ విచారణ అప్‌డేట్స్‌.. 

కేసీఆర్‌కు 18 ప్రశ్నలు.. కమిషన్‌కు కీలక డాక్యుమెంట్స్‌

  • జీవో-45 నెంబర్‌తో కలిగిన జీవోను కమిషన్‌కు ఇచ్చిన కేసీఆర్.
  • ఆపరేషన్స్ అండ్ మెంటినెన్స్ బుక్‌ను కమిషన్‌కు అందజేసిన కేసీఆర్‌.
  • కేసీఆర్‌ను 18 ప్రశ్నలు అడిగిన కమిషన్.
  • THE LIFE LINE OF KALESWARAM PPRJECT అనే పేరుతో ఉన్న డాక్యుమెంట్‌ను కమిషన్‌కు అందించిన కేసీఆర్‌
  • కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కేసీఆర్‌ను ప్రశ్నించిన కమిషన్.
  • నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్న కేసీఆర్.
  • బ్యారేజీల్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్న.
  • టెక్నికల్ అంశాల ఆధారంగా స్టోరేజ్ నిర్ణయం అధికారులు తీసుకున్నట్లు తెలిపిన కమిషన్.
  • బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్‌ ప్రశ్న.
  • టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయి.
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని క్యాబినెట్ అనుమతి ఉందని తెలిపిన కేసీఆర్.
  • ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, CWC లేఖలను కమిషన్‌కు తెలిపిన కేసీఆర్.
     

ఫాంహౌస్‌కు బయలుదేరిన కేసీఆర్‌.. 

  • కాళేశ్వరం విషయంలో 115వ సాక్షిగా కేసీఆర్‌ను విచారించిన కమిషన్‌.
  • తెలంగాణలో నీటి లభ్యత, వినియోగంపై కేసీఆర్‌ వివరించినట్టు సమాచారం.
  • బీఆర్‌కే భవన్‌ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌.

ముగిసిన కేసీఆర్‌ విచారణ

  • కాళేశ్వరం కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ విచారణ ముగిసింది. 
  • దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్‌.. కేసీఆర్‌ను విచారించింది. 
  • కాళేశ్వరం నిర్మాణంపై ప్రశ్నలు అడిగిన కమిషన్‌
  • పలు డాక్యుమెంట్లను కమిషన్‌కు అందజేసిన కేసీఆర్‌. 
  • కాసేపట్లో బీఆర్‌కే భవన్‌ నుంచి కేసీఆర్‌ బయటకు రానున్నారు. 

కేసీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ముందు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
  • కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కమిషన్‌కు నివేదిక ఇచ్చిన కేసీఆర్.
  • కమిషన్ విచారణలో పాల్గొన్న ఇద్దరు నోడల్ అధికారులు.
  • మొత్తం నలుగురు అధికారుల సమక్షంలో సాగుతున్న కేసీఆర్ విచారణ.
  • నోడల్ అధికారుల పేర్లు శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డి

వన్‌ టు వన్‌ విచారణ..

  • కేసీఆర్‌ను వన్‌ టు వన్‌ విచారణ జరుపుతున్న పీసీ ఘోష్‌.
  • అనారోగ్య కారణాలతో ఇన్‌ కెమెరా విచారణ కోరిన కేసీఆర్‌
  • ఓపెన్‌ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించిన కమిషన్‌ చైర్మన్‌ ఘోష్‌. 

కేసీఆర్‌తో ప్రతిజ్ఞ

  • దేవుని పై ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని కేసీఆర్ తో ప్రతిజ్ఞ చేయించిన కమిషన్ చైర్మన్‌ ఘోష్‌.
  • కమిషన్‌కు పలు డాక్యుమెంట్స్ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్

బీఆర్‌కే భవన్‌ వద్ద ఉద్రిక్తత

  • బీఆర్‌కే భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
  • ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్‌.
  • పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట. 

 

👉కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్‌..

ఇవన్నీ సీఎం రేవంత్‌ డ్రామాలు: కేటీఆర్‌

👉బీఆర్‌కే భవన్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నాలుగేళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వంద కాంపోనెంట్స్‌ ఉన్నాయి. ఒక్క దాంట్లో చిన్న సమస్య వస్తే.. మొత్తం ప్రాజెక్ట్‌ వేస్ట్‌ అంటున్నారు. ఇరిగేషన్‌పై కేసీఆర్‌కు ఉన్న అవగాహన ఏ నాయకుడికి లేదు. ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం ఆడిస్తున్న డ్రామాలు ఇవి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు. మేడిగడ్డలో కాంగ్రెస్‌ వాళ్లే కుట్ర చేసి ఉంటారు. సీఎం రేవంత్‌.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించడానికి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. 94వేల కోట్ల ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. 

 

  • బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు. 
  • తన వెంటన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల ఫైల్‌ను కేసీఆర్‌ తీసుకెళ్లారు. 
  • కేసీఆర్‌ వెంటన తొమ్మిది లోపలికి వెళ్లారు. 

 

👉బీఆర్‌కే భవన్‌ వద్దకు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 

👉నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

బీఆర్‌కే భవన్‌ వద్ద హైటెన్షన్‌

  • కమిషన్‌ కార్యాలయానికి కేసీఆర్‌తో పాటు మరో 9 మందికి మాత్రమే అనుమతి.
  • మధుసూదనాచారి, హరీష్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, రవిచంద్ర, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌, పద్మారావు, మహమూద్‌ అలీ, లక్ష్మారెడ్డికి అనుమతి.
  • బీఆర్‌కే భవన్‌ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.
  • బీఆర్‌కే భవన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు. వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.
  • రోప్‌తో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కట్టడి చేస్తున్న పోలీసులు.
  • బీఆర్‌కే భవన్‌ వద్ద పోలీసులతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల వాగ్వాదం.
  • జై కేసీఆర్‌.. జై తెలంగాణ అంటూ గులాబీ పార్టీ కార్యకర్తల నినాదాలు.. 

 

👉ఎర్రవల్లి ఫాం హౌస్ నుండి బీఆర్‌కే భవన్‌ బయలుదేరిన కేసీఆర్, హరీష్ రావు, కవిత

 

కేసీఆర్‌ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్‌రావు

  • తెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన త్యాగాలు సాటిలేనివి.
  • తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌ నిబద్ధత అచంచలమైనది.
  • కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు.
  • ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు. 

 

కోర్టు హాల్‌ సిద్ధం..

  • కమిషన్ కార్యాలయంలో కోర్టు హాల్ సిద్ధం చేసిన అధికారులు.
  • ఇన్ కెమెరా ఏర్పాట్లను సైతం సిద్ధంగా ఉంచిన కమిషన్ సిబ్బంది.
  • కేసీఆర్ సమ్మతితో ఓపెన్ కోర్టు విచారణ లేదా ఇన్ కెమెరా విచారణ చేయనున్న కమిషన్
  •  

👉బీఆర్‌కే భవన్ వద్దకు చేరుకుంటున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.

👉దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు

👉కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇటీవలే మాజీ మంత్రులనూ విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. కేసీఆర్‌ వస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు.

👉బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఉదయం 11:30 గంటలకు బీఆర్‌కే భవన్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌ ముందు రోడ్డును అధికారులు మూసివేశారు. దాదాపు ఐదు వేల మందికిపైగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ట్యాంక్ బండ్ వైపు రోడ్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.  బీఆర్‌కే భవన్‌లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కు వచ్చే వారిని గేట్ బయటే నిలిపివేస్తున్నారు. 

👉ఇదిలా ఉండగా.. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తిచేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా, కమిషన్‌లోని ఇంజినీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. నేడు కేసీఆర్‌ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా లేక కేవలం కమిషన్‌ అధికారుల వరకే పరిమితమై ఇన్‌కెమెరా విచారణ, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement