‘కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి’

Etela Rajender About Basti Davakhana And Corona Facilities - Sakshi

దేశ వ్యాప్తంగా పోల్చితే తెలంగాణలోనే తక్కువ మరణాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి.. అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. కరోనాకు చంపే శక్తి లేదని.. సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగిన దానిని అనుసరించామని తెలిపారు. అందులో భాగమే బస్తీ దవాఖాన అన్నారు. వీటిల్లో మందులకు కొదవ లేదని తెలిపారు. యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 50-60 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనాతో మరణిస్తున్న వారితో పోల్చితే.. తెలంగాణలో తక్కువగానే చనిపోతున్నారని మంత్రి ఈటల తెలిపారు. (చదవండి:కోవిడ్‌ విధుల్లో వైద్యులు మరణిస్తే..)

కోవిడ్‌ పాజిటివ్ వచ్చిన వ్యకులకు ఐసోలేషన్‌ కిట్లు ఇస్తున్నామన్నారు ఈటల. హైదరాబాద్ రెసిడెంట్స్ వెలిఫెర్ అసోసియేషన్‌కు తమ మద్దతుంటుందని తెలిపారు. 80 శాతం మందికి మందులతో నయం అవుతుంది.. 4 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు. .ప్రజల్లో కరోనా పట్ల అవగాహన బాగానే పెరిగిందన్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలని మంత్రి ఈటల తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top