మంత్రి జగదీష్‌ రెడ్డికి షాకిచ్చిన ఎన్నికల సంఘం.. నోటీసులు జారీ!

Election Commission Notices To Minister Jagadish Reddy - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మునుగోడు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. పొలిటికల్‌ నేతలు ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఇక, పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, తాజాగా మంత్రి జగదీష్‌ రెడ్డికి అనుకోని షాక్‌ తగిలింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ మంత్రి జగదీష్‌రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. రేపు(శనివారం) మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top