సాక్షి హైదరాబాద్: గోల్కోండ తారామతిలో రిసార్టులో ఈగల్ టీమ్, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులు చేపట్టింది. అక్కడి నిర్వహిస్తున్న జాక్ జాన్సన్ ఈవెంట్లో పాల్గొన్న మెుత్తం 36 మందికి పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈవెంట్కు పలువురు సినీ నటులు హజరయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


