నన్ను అంతం చేసే కుట్ర ఎమ్మెల్యే రాజాసింగ్‌  | BJP MLA Raja Singh Inaugurates Statue Of Shivaji Maharaj In Sangareddy District | Sakshi
Sakshi News home page

నన్ను అంతం చేసే కుట్ర ఎమ్మెల్యే రాజాసింగ్‌ 

Feb 21 2022 2:13 AM | Updated on Feb 21 2022 2:13 AM

BJP MLA Raja Singh Inaugurates Statue Of Shivaji Maharaj In Sangareddy District - Sakshi

కల్హేర్‌(నారాయణఖేడ్‌): ధర్మం కోసం పని చేస్తున్న తనను అంతం చేసేందుకు కొన్నిశక్తులు కుట్ర చేస్తున్నాయని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం గరిడెగాంలో ఆదివారంనాడు శివాజీ మహరాజ్‌ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

తన నోరు మూయించాలని చూస్తే.. వంద మంది రాజాసింగ్‌లు పుట్టుకొస్తారన్నారు. కొందరు విదేశాల నుంచి డబ్బు పంపి మతమార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన చంద్రశేఖర్‌ మహరాజ్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, గంగారం, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలె భాస్కర్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement