రోంపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిపై మూడు ఎలుగుబంట్ల దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిర్యాణి మండలం రోంపల్లిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన మోడితే శంకర్ (54)పై మూడు ఎలుగుబంట్లు ఒకేసారి దాడి చేశాయి. మేకలు మేపుతుండగా ఎలుగుబంట్లు దాడి చేయడంతో శంకర్ పెద్దగా కేకల వేస్తూ భయాందోళనకు గురయ్యాడు.
ఆ కేకలతో అప్రమత్తమైన సమీప గ్రామస్థులు.. ఎలుగుబంట్లును తరిమికొట్టారు. అయితే ఈ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని నుతిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


