చేప ఆకారంలో శిశువు జననం.. అంతలోనే

Baby Born As Fish Shape In Hyderabad - Sakshi

కాళ్లు కలిసిపోయి.. చేప ఆకారంలో

జన్యులోపంతో పుట్టిన శిశువు...

కొద్ది గంటల్లోనే మృతి

దూద్‌బౌలి: ఓ మహిళకు వింత (చేప) ఆకారంతో శిశువు జన్మించింది. జన్యు లోపం కారణంగా జన్మించిన కొద్ది గంటల్లోనే ఆ శిశువు మరణించింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం రాత్రి జరిగింది. సంగారెడ్డికి చెందిన తహసీన్‌ సుల్తానా (20), మహ్మద్‌ ఆరీఫ్‌లు దంపతులు. ఈ నెల 5న తహసీన్‌ సుల్తానా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు కాళ్లు అతుక్కుని చేప రూపంలో శిశువు జన్మించింది. విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగమణికి తెలిపారు. వైద్య చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు ఆ శిశువు మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, జన్యులోపం వల్లే ఇలా జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top