17 Year Old Went Missing in Quthbullapur | Details Inside - Sakshi
Sakshi News home page

‘మీ జీవితంలో 17 ఏళ్లు ప్రశాంతత దూరం చేశాను.. నన్ను క్షమించండి’

Sep 1 2021 9:13 AM | Updated on Sep 1 2021 1:31 PM

17 Year Old Writes Letter To Parents And Went Missing In Quthbullapur - Sakshi

నన్ను క్షమించండని లేఖ రాసి విద్యార్థి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

సాక్షి, జీడిమెట్ల: మీ జీవితంలో 17 ఏళ్లపాటు ప్రశాంతత దూరం చేసినందుకు నన్ను క్షమించండి. మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఓ విద్యార్థి లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు సమాచారం మేరకు... కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ చెరుకుపల్లి కాలనీకి చెందిన ఎ.శివుడు కుమారుడు ఎ.పునీత్‌(17) ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు.

సోమవారం ఉదయం నీట్‌ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన పునీత్‌ రాత్రైనా తిరిగి రాలేదు. పునీత్‌ తండ్రి శివుడు కళాశాలకు వెళ్లి వాకబు చేయగా కళాశాల సిబ్బంది అక్కడకు రాలేదని తెలిపారు. పునీత్‌ రూంలో వెతకగా పునీత్‌ రాసిన ఉత్తరం లభించింది. దీంతో కంగారు పడిన పునీత్‌ తండ్రి సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: పోలీసులకు తలనొప్పి.. చచ్చిందెవరో.. చంపిందెవరో!
స్నేహితురాలి వద్దకు వెళుతున్నానని...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement