Tamil Nadu: గోడకు కన్నం.. నగలు మాయం!
తిరువొత్తియూరు: వేలూరులో ప్రముఖ నగల దుకాణం గోడకు కన్నం వేసి రూ. కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాల నగలను చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వేలూరు జిల్లా వేలూరు తోటపాలెం ప్రాంతంలో జోస్ అలుకాస్ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వ్యాపారం పూర్తయిన తరువాత ఉద్యోగులు దుకాణానికి తాళం వేసి వెళ్లారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఉద్యోగులు దుకాణం తెరిచి లోపలకు వెళ్లగా.. ఆ సమయంలో రాక్లలోని నగలు అన్ని అదృశ్యమైనట్లు గుర్తించా రు. వేలూరు నార్త్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలతో తనిఖీ చేపట్టి, సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు.