క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Dec 24 2025 4:14 AM | Updated on Dec 24 2025 4:14 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

●నిందితుడి అరెస్టు

విమానయాన భద్రతానిర్వహణలో శిక్షణ

కొరుక్కుపేట: దేశంలో విమానయాన భద్రతను పెంచడానికి ఐఐటీ మద్రాసు ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌ కృషిచేస్తుంది. ఈక్రమంలో అంతర్జాతీయంగా యూరప్‌లోని ప్రముఖ విమానయాన వర్సిటీగా గుర్తింపు పొందిన ఫ్రెంచ్‌ విశ్వవిద్యాలయం ఈఎన్‌ఏసీతో భాగస్వామ్యం చేసుకుని విమానయాన భద్రతా నిర్వాహణ(ఏఎస్‌ఏం)లో శిక్షణను అందిస్తోంది. విమానయాన భద్రతా నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించే దిశగా ఈ శిక్షణ అందిస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమం రెండవ బ్యాచ్‌లో 30మంది వరకు పాల్గొనే వారి సామర్థ్యం 2026 ఫిబ్రవరి నుంచి తాత్కాలికంగా శిక్షణ ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు 2026 జనవరి 31 గడువు తేదీ అని ఐఐటీ ఎం ప్రవర్తక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎంజే శంకరరామన్‌ తెలిపారు

పేరు తొలగింపుపై

మండిపాటు

తిరువొత్తియూరు: ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడంపై పొన్‌ కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడు రైతులు, కార్మికుల పార్టీ అధ్యక్షుడు పొన్‌న్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రస్తుతం ఈ పథకం నుంచి గాంధీ పేరు తొలగించారని తెలిపారు. ఈ పథకానికి వీబీజీరామ్‌జీ పథకం అంటే వికసిత్‌ భారత్‌ గ్రామీణ ఉపాధి, జీవనోపాధి పథకం అని పేరు మార్చి, మోడీ ప్రభుత్వం దానిని పార్లమెంటులో చట్టంగా ఆమోదించిందని పేర్కొన్నారు. గాంధీ ప్రతిబింబించే అహింస, శాంతిపైనే వారికి అంతులేని కోపం ఉందని తెలిపారు. గాంధీ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, దానిని మోడీ ప్రభుత్వం ఎప్పటికీ కప్పిపుచ్చలేదని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బుధవారం పేరు మార్పుపై వ్యతిరేకంగా డీఎంకే నేతృత్వంలోని మిత్రపక్షాలు నిర్వహించనున్న దేశవ్యాప్త ఆందోళనలో రైతులు కార్మికుల పార్టీ పూర్తిగా పాల్గొనాలని, దక్షిణ చైన్నెలో జరిగే ఆందోళనలో నేను పాల్గొంటానని ప్రకటనలో పేర్కొన్నారు.

సేలంలో నటుడు అరుణ్‌

సేలం: ఒక ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి సినీ నటుడు అరుణ్‌ విజయ్‌ సేలానికి వచ్చారు. సేలం సంరక్షక దేవత వెన్నంగుడి మునియప్పన్‌ను ఆయన దర్శనం చేసుకున్నారు. ఆయనను చూడటానికి అభిమానులు ఆ ప్రాంతంలో పెద్దసంఖ్యలో గుమిగూడారు.

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

తిరువొత్తియూరు: పోలీస్‌ ఉన్నతాధికారితో మహిళా కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం బయటపడడంతో విషం తాగి మహిళ ఆత్మహత్యకు యత్నించింది. పుదుచ్చేరి రాష్ట్రం, కారైక్కాల్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌. రెండు రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కారైక్కాల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో కారైక్కాల్‌లో గతంలో పనిచేసిన ఒక ఉన్నతాధికారికి, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ ఉన్నతాధికారి రెండు నెలల క్రితం పుదుచ్చేరికి బదిలీ అయ్యాడు. దీంతో వారిద్దరూ వీడియో కాల్‌లో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారు. అనుమానించిన ఆమె భర్త పోలీస్‌ కావడంతో భార్య సెల్‌ఫోన్‌ కాల్‌డేటా పరిశీలించడంతో విషయం బయటపడింది. దీంతో భర్త కారైక్కాల్‌ ఎస్పీ లక్ష్మీ సౌజన్యకు సెల్‌లోని వీడియోలను చూపించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం భర్తకు తెలిసిపోవడంతో మనస్తాపం చెందిన మహిళా కానిస్టేబుల్‌ విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా డాక్టర్‌

స్నానం చేస్తుండగా ఫొటోలు..

అన్నానగర్‌: చైన్నెలోని ఐయనవరం ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ దంతవైద్యురాలు. ఈమె 20వ తేదీ మధ్యాహ్నం తన ఇంటి బాత్రూంలో స్నానం చేస్తోంది. ఆ సమయంలో, బాత్రూమ్‌ పైభాగంలో ఉన్న చిన్న రంధ్రం గుండా సెల్‌ ఫోన్‌ వెలుగు చూడడం చూసి ఆమె దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. దీని తర్వాత, ఆ మహిళ వెంటనే బట్టలు ధరించి బయటకు వచ్చింది. ఆమె పొరుగు ఇంటి నివాసి నందగోపాల్‌ను తన సెల్‌ఫోన్‌ కోసం అడిగినప్పుడు, అతను దానిని ఆమెకు ఇవ్వడానికి నిరాకరించాడు. తర్వాత తన సెల్‌ ఫోన్‌ను నేలపై విసిరి దానిని పగలగొట్టాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఐయనవరం ఇన్‌స్పెక్టర్‌ వర్గీస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మంగళవారం ఉదయం నందగోపాల్‌ (56)ను అరెస్టు చేశారు. నిందితుడు చైన్నెలోని తురైపాక్కంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. నేరం రుజువు కావడంతో నిందితుడిని కోర్టు అనుమతితో రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement