ఏనుగును గాయపరిచిన మావటి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఏనుగును గాయపరిచిన మావటి తొలగింపు

Aug 23 2025 3:01 AM | Updated on Aug 23 2025 3:01 AM

ఏనుగును గాయపరిచిన మావటి తొలగింపు

ఏనుగును గాయపరిచిన మావటి తొలగింపు

తిరువొత్తియూరు: ముదుమలై తెప్పకాడు శిబిరంలో సంరక్షణలో వున్న ఏనుగును కత్తితో పొడిచి గాయపరిచిన మావటిని విధుల నుంచి తొలగించారు. నీలగిరి జిల్లాలోని ముదుమలై పులుల సంరక్షణ కేంద్రం 688 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ సంరక్షణ కేంద్రంలో శతాబ్దాల చరిత్ర కలిగిన తెప్పకాడులో పెంపుడు ఏనుగుల శిబిరం ఉంది. ఇక్కడ 20కి పైగా ఏనుగులను అటవీ శాఖ అధికారులు సంరక్షిస్తున్నారు. ప్రతి ఏనుగుకు ఒక మావటి, ఒక సహాయకుడు ఉంటారు. పెంపుడు ఏనుగులను మావటివాళ్లు రాత్రిపూట అటవీ ప్రాంతంలో మేతకు వదులుతారు. అభయారణ్య ఏనుగుల శిబిరంలో సుమంగళ అనే ఏనుగు ఉంది. దీనికి కృష్ణమారన్‌ అనే మావటి ఉన్నాడు. ఈ ఏనుగు రాత్రిపూట అడవిలోకి వెళ్లి ఉదయం శిబిరానికి వచ్చి మగ ఏనుగులపై దాడి చేయడం, వాటిని నెట్టడం సాధారణం. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేతకు వెళ్లిన సుమంగళ ఏనుగు తెల్లవారుజామున శిబిరానికి వచ్చి శంకర్‌ అనే ఏనుగును నెట్టి కింద పడేసింది. దీంతో శంకర్‌ ఏనుగు పెద్దగా అరిచింది. శంకర్‌ ఏనుగు మావటి విక్కి బయటకు వచ్చి చూశాడు. ఆ సమయంలో శంకర్‌ ఏనుగు కింద పడి ఉంది. దీంతో కోపంతో ఉన్న విక్కి కరత్రో సుమంగళ ఏనుగును కొట్టి దూరంగా పంపడానికి ప్రయత్నించాడు. కానీ సుమంగళ ఏనుగు మళ్లీ శంకర్‌ ఏనుగుపై దాడి చేసింది. దీంతో కోపంతో ఉన్న విక్కి కత్తి తీసుకుని ఏనుగు వెనుక కాలిని కోశాడు. ఆ తర్వాత సుమంగళ ఏనుగు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయింది. విక్కి కత్తితో కోయడంతో ఏనుగుకు గాయమైంది. విషయం తెలిసి సుమంగళ మావటి కృష్ణమారన్‌ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పశు వైద్యులు రాజేష్‌కుమార్‌, సహాయ సంచాలకుడు విద్యా అక్కడికి వెళ్లి గాయపడిన ఏనుగుకు చికిత్స అందించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఏనుగును కత్తితో గాయ పరిచిన మావటిని విధుల నుంచి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement