
22న తిరునల్వేలికి అమిత్ షా
సాక్షి, చైన్నె: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 22వ తేదీన తిరునల్వేలికి రానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లపై బీజేపీ వర్గాలు దృష్టి పెట్టాయి. తమిళనాడులో పాగా వేయడమే లక్ష్యంగా అమిత్ షా వ్యూమాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏడాదిలో నెలకు ఒక పర్యాయం అమిత్ షా తమిళనాడుకు వచ్చి వెళ్లారు. మే నెలలో మాత్రం విరామం ఇచ్చినా జూన్ నెల మదురైలో రెండురోజులు తిష్ట వేశారు. జూలైలో పర్యటనకు ఏర్పాట్లు జరిగినా చివరి క్షణంలో వాయిదా పడింది. తాజాగా ఆగస్టు పర్యటనకు రెడీ అయ్యారు. తమిళనాడులో రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమిలో 50 సీట్లను బీజేపీగురి పెట్టినట్టుగా ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నియోజకవర్గాలలోని బూత్ కమిటీలో మహానాడుకు ఏర్పాట్లు చేస్తున్నా. తిరునల్వేలి వేదికగా జరిగే ఈ మహానాడుకు అమిత్ షా రానున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అమిత్ షా రాక షురూ అని, తిరునల్వేలి నుంచి బూత్ కమిటీల మహానాడు మొదలై, తమకు పట్టున్న చోట్ల కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమిత్ షా రాక సమాచారంతో తిరునల్వేలిలో భారీ ఏర్పాట్లకు బీజేపీ వర్గాలు సన్నద్ధమయ్యాయి.
కేలంబాక్కంలో
బస్సులు లేక ఇక్కట్లు
కొరుక్కుపేట: వరుసుగా మూడు రోజులు సెలవులు రావడంతో చైన్నెలో నివసిస్తున్న చాలా మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీని కారణంగా చైన్నెలోని కేలంబాక్కంలోని బస్టాండ్ వద్ద భక్తుల రద్దీ నెలకొంది. కానీ దక్షిణ జిల్లాలకు వెళ్లే సుదూర ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సులు తగినంత సంఖ్యలో కేటాయించలేదు. దీని కారణంగా చాలామంది ప్రయాణికులు బస్సులు దొరక్క చిక్కుకుపోయారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు బస్సులలో సీట్లు దొరకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. చైన్నె నుంచి రెగ్యులర్గా నడిచే ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సులతో పాటూ ప్రత్యేక బస్సులు కూడా నడిచాయి. అయితే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో తదానుగుణంగా బస్సులు లేకపోవడంతో బస్టాండ్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు మూడు రెట్లు పెరిగిపోవడం విశేషం.
18న వైద్య కౌన్సెలింగ్ జాబిత విడుదల
కొరుక్కుపేట: తమిళనాడులో ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ మొదటి రౌండ్ ఫలితాలను 18న ప్రకటిస్తామని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అడ్మిషన్ కమిటీ తెలిపింది. తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం మొదటి రౌండ్ పబ్లిక్ కన్సల్టేషన్ జూలై 30న ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో ప్రారంభమైంది. ఆన్నలైనన్లో నమోదు చేసుకోవడానికి, కళాశాలలను ఎంచుకోవడానికి గడువు 4వ తేదీ వరకు ఉండగా, దానిని మొదట 6వ తేదీ వరకు, తరువాత 12వ తేదీ వరకు, ఆపై శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సీట్లు కేటాయించి, 18న తుది జాబితాను ప్రచురిస్తారన్నారు. విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఉత్తర్వులను 18వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు. కౌన్సెలింగ్కు సంబంధించి కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని, అందులో ఎలాంటి సమస్యలు లేకుంటే ఫలితాలు ప్రణాళిక ప్రకారం ప్రకటిస్తామని వైద్య విద్య డైరెక్టరేట్ పేర్కొంది.
సముద్రంలో మునిగి ముగ్గురు మహిళల మృతి
అన్నానగర్: పుదుచ్చేరికి విహారయాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవులు ప్రకటించడంతో, చాలా మంది పర్యాటకం కోసం వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది పర్యాటకం కోసం పుదుచ్చేరికి వచ్చారు. దీంతో బీచ్లు, పర్యాటక ప్రదేశాలలో రద్దీ ఏర్పడింది. అదేవిధంగా, బెంగళూరు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి మేఘ (27), పివన్ (25), బ్రిడ్జ్వాల్ (24) సహా 12 మంది ఈ యాత్రకు వచ్చారు. శనివారం పుదుచ్చేరి ప్రాంతం చుట్టూ చూసిన వారికి అరియంగుప్పం సమీపం వీరంపట్టణం బీచ్కి చేరుకున్నారు. తరువాత సముద్రంలోకి దిగి స్నానం చేశారు. అప్పుడు ఊహించని విధంగా ఒక పెద్ద అలలో చిక్కుకున్నారు. వారు కేకలు వేయడంతో అక్కడి ప్రజలు వారిని రక్షించారు. అయితే, మేఘ, పవన్, బ్రిడ్జ్వాల్ మరణించారు. వారి మృతదేహాలను గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని చికిత్స కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.