ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉండాలి

Aug 12 2025 8:01 AM | Updated on Aug 13 2025 4:48 AM

ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉండాలి

ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉండాలి

కొరుక్కుపేట: ప్రతి ఒక్కరితో నిజాయితీగా నడుచుకోవాలని సెంట్రల్‌ లా కాలేజీ చైర్మన్‌ డి.శరవణన్‌ హితవు పలికారు. సేలంలోని సెంట్రల్‌ లా కాలేజీలో మొదటి సంవత్సరం బీఏ, ఎల్‌ఎల్‌బీ ఇండక్షన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. సెంట్రల్‌ లా కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బేగం ఫాతిమా స్వాగత ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. అధ్యక్ష ప్రసంగంలో డి.శరవణన్‌ విద్యార్థులను స్వాగతించారు. న్యాయ విభాగాన్ని ఎంచుకున్నందుకు వారిని అభినందించారు. చట్టం అనేది అంకితభావం, క్రమశిక్షణ, మర్యాదను కోరుకునే గొప్ప వృత్తి అని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో న్యాయవాదుల విధులు, న్యాయవ్యవస్థపై సరైన వైఖరి, వృత్తిపరమైన ప్రదర్శన ప్రాముఖ్యతను వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉండాలని, ఉల్లాసమైన వైఖరిని కొనసాగించాలని కోరారు. తమిళనాడు, పుదుచ్చేరి బార్‌ కౌన్సిల్‌ న్యాయవాది, సహ–చైర్మన్‌ కె.బాలు తన ప్రత్యేక ప్రసంగంలో ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి జీవితం ఉత్తమ దశ అని నొక్కి చెప్పారు. మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ ఎ.ఎ.నక్కీరన్‌ తన ప్రారంభోపన్యాసంలో న్యాయవాద వృత్తి, న్యాయ రంగంలో అభివృద్ధి చెందుతున్న విషయాలను పంచుకున్నారు. న్యాయ పట్టభద్రులకు అందుబాటులో ఉన్న విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలను ఆయన వివరించారు. న్యాయ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కర్ణన్‌ ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement