సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆడక్కడవనా | - | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆడక్కడవనా

May 2 2025 1:51 AM | Updated on May 2 2025 1:51 AM

సస్పె

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆడక్కడవనా

వెర్టికల్‌ ఫార్మెట్‌లో వెబ్‌ సిరీస్‌ యుగం

తమిళసినిమా: సాంకేతికంగా నానాటికీ అభివృద్ధి చెందుతున్న సినిమారంగంలో మరో వినూత్న ప్రయోగం యుగం.ఈ వెబ్‌ సిరీస్‌ వెర్టికల్‌ ఫార్మెట్‌లో రూపొందడం విశేషం. ఈ తరహా వెబ్‌ సిరీస్‌ రూపొందడం ఇండియాలోనే ప్రప్రథమం అంటున్నారు దర్శకుడు కుళందై వేలప్పన్‌. ఇంతకు రెండు చిత్రాలు చేసిన ఈయన మూడో ప్రయత్నంగా యుగం వెబ్‌ సిరీస్‌. ఎంఎస్‌.వెర్టికల్‌ లా సినిమా, ట్రీ ప్రొడక్షనన్స్‌ సంస్థలు నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌లో దర్శకుడు కుళందై. వేలప్పన్‌, ఆయన సతీమణి నర్మదా బాలు జంటగా నటించడం మరో విశేషం. కవితా భారతి ముఖ్య పాత్రను పోషించిన ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన మీడియా సమావేశాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. చిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత కుళందై వేలప్పన్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో సెల్‌ఫోన్‌ తిప్పి పట్టుకోవడం కూడా సోంబేరతనం అవుతుందన్నారు. ఆ విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ఇదని చెప్పారు. ఇటీవల పాల్గొన్న కానన్స్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో వెర్టికల్‌ ఫార్మెట్‌ను నివారించడం సాధ్యం కాదనే చర్చ జరిగిందన్నారు. ఆ తరువాతనే యుగం వెబ్‌ సిరీస్‌ కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. సినిమా అయినా, వెబ్‌ సిరీస్‌ అయినా ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్‌ చేయడమే ప్రధానమన్నారు. ఆవిధంగా ఈ వెర్టికల్‌ ఫార్మెట్‌లో రూపొందించిన యుగం జనరంజకంగా ఉంటుందని చెప్పారు. ఇందుకోసం యూనిట్‌ సభ్యులు ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం వెర్టికల్‌ లా సినిమాస్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ను ప్రారంభించి తద్వారా స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో దర్శకుడు నలన్‌ కుమారస్వామి, నటుడు గురు సోమసుందర్‌ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

యుగం వెబ్‌ సిరీస్‌

హీరో, హీరోయిన్‌లు కుళందై వేలప్పన్‌, నర్మదాబాలు

తమిళసినిమా: సారా కలైకూట్టం పతాకంపై అనితా లియో, లియోవీ. రాజా నిర్మించిన చిత్రం ఆడక్కడవనా. ప్రభుత్వ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది, పలు షార్ట్‌ ఫిల్మ్‌స్‌కు దర్శకత్వం వహించిన ధర్మ ఈ చిత్రం ద్వారా వెండి తెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఇందులో నవ నటుడు ఆధవన్‌ సురేష్‌ కథానాయకుడిగా నటించగా, విన్సెంట్‌, సీఆర్‌.రాహుల్‌, మైఖెల్‌, రాజసిమ్మన్‌, సతీశ్‌ రామదాసు, దక్షిణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. లియో వి.రాజా ఛాయాగ్రహణం, పుదుచ్చేరికి చెందిన శాంతన్‌ సంగీతాన్ని అందించారు. ఈయన ఇంతకు ముందు 200లకు పైగా షార్ట్‌ ఫిలిమ్స్‌ సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హైరోడ్‌లో బైక్‌ పంచర్‌ అయ్యి మిత్రుడితో కలిసి వేచి చూస్తున్న హిరో ఎదుర్కొనే సమస్యలే చిత్ర ఇతివత్తం అని చెప్పారు. అదే విధంగా మనం మాట్లాడే ప్రతి మాట మనతో పాటూ మన చుట్టూ ఉన్న వారిపై ప్రభావం చూపతుందనే అంశాలతో మంచి సందేశం ఉన్న కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్రం ఆధ్యంతం ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. చిత్ర షూటింగ్‌ ను ఇంతకు ముందు ఎవరూ చిత్రీకరించని ప్రాంతాల్లో నిర్వహించినట్లు, ఇవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆడక్కడవనా1
1/2

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆడక్కడవనా

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆడక్కడవనా2
2/2

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఆడక్కడవనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement