
చెక్డ్యాంలో మునిగి కేబుల్ ఆపరేటర్ మృతి
తిరుత్తణి: చెక్డ్యాంలో మునిగి కేబుల్ ఆపరేటర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అరక్కోణం సమీపంలోని ఉలియంపాక్కం గ్రామానికి చెందిన మునిరత్నం కుమారుడు హరిబాబు(40) ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్గా విధులు నిర్వహించేవారు. సోమవారం మధ్యాహ్నం ఉలియంపాక్కం గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు శరవణన్(25)తో కలిసి కనకమ్మసత్రంకు బైకులో వెళ్లారు. అక్కడ మద్యం తీసుకుని ఇళుప్పూర్ సమీపంలోని కుశస్థలి నది మధ్యలో చెక్డ్యాం ఒడ్డున కూర్చుని మద్యం తాగిన తరువాత సాయంత్రం సమయంలో ఇద్దరూ డ్యాంలో సరదాగా ఈతకు వెళ్లారు. ఈ సమయంలో హరిబాబు డ్యాం మధ్యకు వెళ్లగా గట్టుకు తిరిగి చేరుకునే సమయంలో నీట మునిగి గల్లంతయ్యాడు. వెంటనే శరవణన్ కేకలు వేయడంతో ఆ ప్రాంతంలోని వారు గల్లంతైన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో తిరుత్తణి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది డ్యాం వద్దకు చేరుకుని గంటపాటు శ్రమించి హరిబాబు మృతదేహాన్ని వెలికితీశారు. కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన హరిబాబు తిరుత్తణి శక్తిసాయి నగర్లో ఇల్లు నిర్మించుకుని అతని భార్య భారతి, వారికి యోగిత అనే ఎనిమిదేళ్ల పాప, అత్విక్(5) అనే బాలుడు ఉన్నారు. మద్యం మత్తులో డ్యాంలో మునిగి వ్యక్తి మృతి సంఘటన శోకాన్ని మిగిల్చింది.