కల్యాణ వేదికపై ప్రియుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కల్యాణ వేదికపై ప్రియుడు అరెస్ట్‌

May 27 2023 8:38 AM | Updated on May 27 2023 8:46 AM

- - Sakshi

అన్నానగర్‌: బన్‌రూటి సమీపంలో ప్రేమించి మోసపోయిన యువతి గురువారం ధర్నాకు దిగగా, మరో పెళ్లి చేసుకోబోతున్న ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడలూరు జిల్లా బన్‌రూటి సమీపంలోని ఎల్లెంపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (31) మెకానిక్‌. ఇతను అదే పట్టణానికి చెందిన పట్టభద్రురాలు అయిన యువతి (29) పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ స్థితిలో యువతి గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని సుబ్రమణ్యన్‌ంపై ఒత్తిడి తెచ్చింది. దీనికి సుబ్రమణ్యం అంగీకరించలేదు. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం సుబ్రమణ్యంకు, అతని బంధువుతో నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న యువతి బన్‌రూటి మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది. కడలూరు పాతిరికుప్పంలోని ఓ ఆలయంలో పెళ్లికి సన్నాహాలు జరిగాయి.

ఈ విషయం తెలిసి బాధిత యువతి సుబ్రమణ్యం ఇంటికి వెళ్లి బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ధర్నా చేసింది. సమాచారమందుకున్న మహిళా పోలీసులు సుబ్రమణ్యనంను్‌ కల్యాణమండపంలో అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement