ఎన్నికల ఖర్చు వివరాలివ్వని ఆరుగురిపై మూడేళ్ల నిషేధం | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఖర్చు వివరాలివ్వని ఆరుగురిపై మూడేళ్ల నిషేధం

Published Sun, Apr 30 2023 7:50 AM

- - Sakshi

సాక్షి, చైన్నె : ఎన్నికల ఖర్చు లెక్కలను సమర్పించని ఆరుగురిని మూడేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విఽధిస్తూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. వివరాలు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఖర్చు వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఇందులో ఆరుగురు అభ్యర్థులు ఇంత వరకు ఖర్చుల వివరాలను తెలియజేయలేదు.

దీంతో ఈ ఆరుగురు మూడేళ్లు పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి నిషేధం విధిస్తూ ఉత్తర్వులు శనివారం జారీ అయ్యాయి. ఇందులో శంకరన్‌ కోయిల్‌ నుంచి పోటీ చేసిన మక్కల్‌ నీదిమయ్యం అభ్యర్థి ప్రభు, అదే నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బాల మురుగేషన్‌, అవినాశిలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శకుంతల, సైదాపేటలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఇలంగో వెంటేషన్‌, విరుగంబాక్కం అన్నా ద్రావిడ మక్కల్‌ కలగం అభ్యర్థి దినేషన్‌ కుమార్‌ ఉన్నారు.

Advertisement
Advertisement