పోలీస్‌ స్టేషన్‌పై దాడికి 20 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌పై దాడికి 20 ఏళ్లు

Aug 18 2026 8:04 AM | Updated on Aug 18 2026 8:04 AM

ఆత్మకూరు(ఎం) : సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2006 ఆగస్టు 18న రాత్రి మావోయిస్టుల మెరుపుదాడితో ఆత్మకూరు(ఎం) పోలీస్‌ స్టేషన్‌ రక్తసిక్తమైంది. ఆ భీకర దాడిలో ఎస్‌ఐ ఎండీ చాంద్‌ పాషా, ఏఎస్‌ఐ సుల్తాన్‌ మోహినొద్దీన్‌, హోంగార్డు లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన మరో కానిస్టేబుల్‌ కరీం ఏడాది పాటు మంచానికే పరిమితమై కన్నుమూశారు. ఈ దాడి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని స్టేషన్‌ వద్దకు వెళ్లి చూడగా, విధ్వంసకర దృశ్యాలు కనిపించాయి. స్టేషన్‌ ఆవరణ అంతా భయానకంగా మారింది. తోటి పోలీసు సిబ్బంది కొందరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకున్నారు. ఈ దారుణ సంఘటన జరిగి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ప్రాణ త్యాగం చేసిన పోలీసులను మండల ప్రజలు, అధికారులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు.

ఆనాటి ఘటనలో మృతిచెందిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హోంగార్డు, కానిస్టేబుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement