ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి

Apr 9 2025 1:34 AM | Updated on Apr 9 2025 1:34 AM

ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి

ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి

చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్‌ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఖైదీలు ఉంటున్న గదులను పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. దీని వల్ల కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుందన్నారు. మంచి నడవడిక కలిగి ఉండి సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు. జైలులో ఉన్న ఖైదీలు అడ్వకేట్లను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకుంటే డీఎల్‌ఎస్‌ఏకు దరఖాస్తు చేసుకోవాలని, ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌ కుమార్‌, పెండెం వాణి ,జైలు సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement